ముఖ్య సమాచారం
-
800 అడుగుల లోయలో పడిన కారు.. ఆరుగురి దుర్మరణం
-
తెలంగాణ పంచాయతీ రెండో విడతఎన్నికలలో 415 మంది సర్పంచ్ లు ఏకగ్రీవం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావుకు బిగుస్తున్న ఉచ్చు
Updated on: 2025-10-08 13:33:00
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికలో కీలకమైన ఆధారాలు లభించాయని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది.జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నుంచి అందిన నివేదికలో, డిజిటల్ ఫోరెన్సిక్ ప్లాట్ఫామ్ ద్వారా అత్యంత ముఖ్యమైన ఆధారాలు సేకరించినట్లు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆధారాలు కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయని ఆయన పేర్కొన్నారు.