ముఖ్య సమాచారం
-
కిశోరి వికాసం.. బాలిక బంగారు భవిష్యత్తుకు పునాది..
-
బాడంగి మండలంలో పలువురు లబ్ధిదారులకు ఎం జీవిత భీమా పరిహార చెక్కు అందజేత
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావుకు బిగుస్తున్న ఉచ్చు
Updated on: 2025-10-08 13:33:00
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికలో కీలకమైన ఆధారాలు లభించాయని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది.జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నుంచి అందిన నివేదికలో, డిజిటల్ ఫోరెన్సిక్ ప్లాట్ఫామ్ ద్వారా అత్యంత ముఖ్యమైన ఆధారాలు సేకరించినట్లు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆధారాలు కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయని ఆయన పేర్కొన్నారు.