ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
Updated on: 2025-12-05 09:01:00
రాజధానిలో గవర్నర్ నివాసం లోక్ భవన్ నిర్మాణానికి అథారిటీ ఆమోదం
రూ.7380 కోట్ల నాబార్డు రుణ స్వీకరణకు అంగీకారం
తెలుగు వైభవంగా నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 55వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
అమరావతి, డిసెంబరు 4: రాజధాని అమరావతిని ఓ క్రియేటివ్ సిటీగా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మించే ప్రతీ భవనం విలక్షణంగా ఉండాలని ఆయన సూచించారు. నిర్మించే ప్రతీ భవనం ప్రస్ఫుటంగా కనిపంచే విధంగా, పచ్చదనంతో అలరారేలా నిర్మించాలని పేర్కొన్నారు.
రాజధాని నగరంలో భవనాల డిజైన్ల కోసమే గతంలో విస్తృతంగా అధ్యయనం నిర్వహించామని సీఎం స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 55వ సీఆర్డీఏ అథారిటీ సమావేశమైంది. సీఆర్డీఏ, ఏడీసీ ప్రతిపాదించిన కొన్ని అంశాలకు ఆమోదాన్ని తెలియచేసింది. అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ లో గవర్నర్ నివాస సముదాయం లోక్ భవన్ నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనలకు అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. రూ.169 కోట్ల వ్యయంతో లోక్ భవన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. రూ. 165 కోట్ల వ్యయంతో ఏపీ జ్యూడిషియల్ అకాడెమీ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
అలాగే 2024-25 వార్షిక గణాంకాల నివేదికలకు ఆమోదం తెలిపింది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు నుంచి రూ. 7,380 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు సీఎం అధ్యక్షతన సీఆర్డిఏ అథారిటీ అంగీకారాన్ని తెలిపింది. ఇ-3 సీడ్ యాక్సెస్ రహదారిని ఎన్ హెచ్ 16 జాతీయ రహదారితో అనుసంధానించేందుకు రూ.532 కోట్లతో టెండర్లను పిలిచేందుకు కూడా అథారిటి ఆమోదాన్ని తెలియచేసింది.