ముఖ్య సమాచారం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
Updated on: 2025-12-05 09:01:00
రాజధానిలో గవర్నర్ నివాసం లోక్ భవన్ నిర్మాణానికి అథారిటీ ఆమోదం
రూ.7380 కోట్ల నాబార్డు రుణ స్వీకరణకు అంగీకారం
తెలుగు వైభవంగా నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 55వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
అమరావతి, డిసెంబరు 4: రాజధాని అమరావతిని ఓ క్రియేటివ్ సిటీగా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మించే ప్రతీ భవనం విలక్షణంగా ఉండాలని ఆయన సూచించారు. నిర్మించే ప్రతీ భవనం ప్రస్ఫుటంగా కనిపంచే విధంగా, పచ్చదనంతో అలరారేలా నిర్మించాలని పేర్కొన్నారు.
రాజధాని నగరంలో భవనాల డిజైన్ల కోసమే గతంలో విస్తృతంగా అధ్యయనం నిర్వహించామని సీఎం స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 55వ సీఆర్డీఏ అథారిటీ సమావేశమైంది. సీఆర్డీఏ, ఏడీసీ ప్రతిపాదించిన కొన్ని అంశాలకు ఆమోదాన్ని తెలియచేసింది. అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ లో గవర్నర్ నివాస సముదాయం లోక్ భవన్ నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనలకు అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. రూ.169 కోట్ల వ్యయంతో లోక్ భవన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. రూ. 165 కోట్ల వ్యయంతో ఏపీ జ్యూడిషియల్ అకాడెమీ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
అలాగే 2024-25 వార్షిక గణాంకాల నివేదికలకు ఆమోదం తెలిపింది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు నుంచి రూ. 7,380 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు సీఎం అధ్యక్షతన సీఆర్డిఏ అథారిటీ అంగీకారాన్ని తెలిపింది. ఇ-3 సీడ్ యాక్సెస్ రహదారిని ఎన్ హెచ్ 16 జాతీయ రహదారితో అనుసంధానించేందుకు రూ.532 కోట్లతో టెండర్లను పిలిచేందుకు కూడా అథారిటి ఆమోదాన్ని తెలియచేసింది.