ముఖ్య సమాచారం
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
-
డిజిటల్ అరెస్టులకు చెక్ పెట్టేలా....జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
-
ఎమ్మెల్యే బేబీ నాయనకు ధన్యవాదాలు తెలిపిన బొబ్బిలి మాజీ సైనికులు
-
ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు చేసిన సీఐడీ
-
కెవైసి, బ్యాంకింగ్ భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం*
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
Updated on: 2026-02-21 21:15:00
విజయవాడ: వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు రూ.3.5వేల కోట్ల కుంభకోణంలో రెండో నిందితుడిగా ఉన్న అప్పటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. అతడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గతంలోనే ఏసీబీ కోర్టు నిరాకరించిన వేళ.. సిట్ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. మద్యం కేసులో వాసుదేవరెడ్డితోపాటు ఎక్సైజ్శాఖ మాజీ ప్రత్యేక అధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్ కీలక పాత్ర అని.. వారి కేంద్రంగానే కుంభకోణం జరిగిందని విజయవాడ ఏసీబీ కోర్టు గతంలో స్పష్టం చేసింది.
మొత్తం కుంభకోణం శరీరమైతే.. వారిద్దరూ తలలాంటివారని తెలిపింది. తల తీసేస్తే శరీరం కుప్పకూలుతుందని, వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం ఆర్డర్లు కట్టబెట్టడంలో.. వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. గతంలోనే ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. ఎప్పుడైనా అరెస్టు చేస్తారనే అనుమానంతో వాసుదేవరెడ్డి బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విజయవాడలోని ఏసీబీ కోర్టుతోపాటు హైకోర్టు కూడా.. వాసుదేవరెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి.
ఈ నెల 27 వరకు రిమాండ్
వాసుదేవరెడ్డి రిమాండ్పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరించారని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఆయన అప్రూవర్గా మారినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. ప్రాసిక్యూషన్ ఏజెన్సీకి సహకరిస్తున్నారని, వాసుదేవరెడ్డిని అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 27 వరకు రిమాండ్ విధించింది. కాసేపట్లో వాసుదేవరెడ్డిని పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్నారు.