ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
Updated on: 2025-12-07 12:10:00
ఉయ్యూరు మండలం ముదునూరులో ఒకరి మృతి
అధికారికంగా కృష్ణాలో 15, ఎన్టీఆర్లో రెండు కేసులు
స్క్రబ్ టైఫస్ ఉమ్మడి కృష్ణాజిల్లాను కలవరపెడుతోంది. కృష్ణాజిల్లాలో 15 కేసులు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇవికాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్క్రబ్ టైఫస్ బారిన పడి ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామానికి చెందిన బుట్టి శివశంకర్రాజు (42) ఈనెల 4న మృతిచెందడం కలకలం రేపుతోంది. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఆయన మచిలీపట్నం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. లక్షణాలను బట్టి పరీక్ష చేయగా, స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫాం (ఐహెచ్ఐపీ) పోర్టల్లో రాజుకు పాజిటివ్ వచ్చినట్టుగా అప్లోడ్ చేశారు. విషయం తెలుసుకున్న కృష్ణాజిల్లా వైద్యాధికారి డాక్టర్ పి.యుగంధర్ శనివారం సాయంత్రం ముదునూరులోని మృతుడు శివశంకర్రాజు ఇంటికి వెళ్లారు. అతని కుటుంబసభ్యులు, స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కిడ్నీ సంబంధిత వ్యాధితో శివశంకరరాజు బాధపడుతున్నట్లు తమ విచారణలో తేలిందని, దీనివల్లే ఆయన మృతిచెందినట్లు నిర్ధారణకు వచ్చామని వెల్లడించారు. పేడపురుగు కుట్టడం వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుందని, కానీ చనిపోయే అవకాశాలు చాలా తక్కువని తెలిపారు. మందులు వాడితే తగ్గిపోతుందన్నారు
గుడ్లవల్లేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రెండు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి యశస్వినీ శనివారం తెలిపారు. స్థానిక ఇందిరా కాలనీకి చెందిన మానస, పామర్రుకు చెందిన అమలేశ్వరి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనారోగ్యంతో వచ్చారని, రక్త నమూనాలను సేకరించి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పంపగా, స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా నమోదైందన్నారు. ఇద్దరికీ చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.