ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
Updated on: 2025-12-06 08:11:00
రామనాథపురం వద్ద రెండు కార్లు ఢీ..ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందడం విషాదాన్ని నింపింది.. తమిళనాడులోని రామనాథపురం జిల్లా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. రామేశ్వరం నుంచి తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తుల కారును మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతి చెందినవారిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారని గుర్తించారు.గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న కీజక్కరై పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.. ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి..