ముఖ్య సమాచారం
-
చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్కు షాకిచ్చిన భారత స్టార్ గుకేశ్
-
గన్నవరం సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ.. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయం
-
ట్రంప్ కు భారీ విజయం.. 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను అమెరికా పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం
-
ఖమ్మం-వరంగల్ హైవేపై ఘోర ప్రమాదం... ముగ్గురు సజీవ దహనం
-
పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా.. 65 మంది గల్లంతు
-
మైక్రోసాఫ్ట్లో భారీగా లేఆఫ్స్.. రోడ్డున పడ్డ 9వేల మంది ఉద్యోగులు
-
పెనమలూరు: యువకుడి వేధింపులతో వివాహిత ఆత్మహత్యాయత్నం
-
అనకాపల్లి జిల్లాలో విషాదం...జాలరిని సముద్రంలోకి లాక్కెళ్లిన 100 కిలోల చేప..
-
జగన్ను కలిసిన వల్లభనేని వంశీ
-
జపాన్ను వణికిస్తున్న సునామీ జోస్యం
గన్నవరం సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ.. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయం
Updated on: 2025-07-04 08:04:00

గన్నవరం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు ఏకంగా రూ.13.56 లక్షల విలువైన నాన్-జ్యుడీషియల్ స్టాంపు పేపర్లను అపహరించుకుపోయారు. అధికారులు ఈ ఘటనపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, చోరీకి గురైన స్టాంపు పేపర్లను ఎవరూ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే... బుధవారం విధులు ముగిసిన తర్వాత సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లారు. గురువారం ఉదయం కార్యాలయం తెరిచేందుకు రాగా, ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బయటి గదిలోని బీరువాను పగలగొట్టి అందులో ఉన్న స్టాంపు పేపర్ల బండిళ్లను దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దొంగలు చాలా పక్కా ప్రణాళికతో ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. వేలిముద్రలు దొరకకుండా గ్లోవ్స్ ధరించి, పని పూర్తియ్యాక వాటిని అక్కడే పడేసి వెళ్లారు.