ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
Updated on: 2025-12-05 08:30:00
పాక్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా అసిమ్ మునీర్
పాకిస్థాన్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను కొత్తగా సృష్టించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) పదవిలో నియమించింది. ఈ నియామకంతో ఆయన పాకిస్థాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా అవతరించారు. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లను ఏకీకృతం చేసే లక్ష్యంతో 27వ రాజ్యాంగ సవరణ ద్వారా పాక్ ప్రభుత్వం ఈ సీడీఎఫ్ పదవిని తీసుకొచ్చింది. ప్రధాని సిఫార్సు మేరకు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ నియామకాన్ని ఆమోదించినట్టు అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పదవిలో మునీర్ ఐదేళ్ల పాటు కొనసాగుతారు. సీడీఎఫ్గా ఆయనకు అధ్యక్షుడితో సమానంగా న్యాయపరమైన రక్షణ లభిస్తుంది. దీనివల్ల ఆయనపై ఎలాంటి విచారణ జరిపే అవకాశం ఉండదు.