ముఖ్య సమాచారం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
Updated on: 2025-12-05 08:30:00
పాక్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా అసిమ్ మునీర్
పాకిస్థాన్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను కొత్తగా సృష్టించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) పదవిలో నియమించింది. ఈ నియామకంతో ఆయన పాకిస్థాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా అవతరించారు. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లను ఏకీకృతం చేసే లక్ష్యంతో 27వ రాజ్యాంగ సవరణ ద్వారా పాక్ ప్రభుత్వం ఈ సీడీఎఫ్ పదవిని తీసుకొచ్చింది. ప్రధాని సిఫార్సు మేరకు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ నియామకాన్ని ఆమోదించినట్టు అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పదవిలో మునీర్ ఐదేళ్ల పాటు కొనసాగుతారు. సీడీఎఫ్గా ఆయనకు అధ్యక్షుడితో సమానంగా న్యాయపరమైన రక్షణ లభిస్తుంది. దీనివల్ల ఆయనపై ఎలాంటి విచారణ జరిపే అవకాశం ఉండదు.