ముఖ్య సమాచారం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
సచివాలయాలకు పర్యవేక్షకులొస్తున్నారు!
Updated on: 2025-11-18 09:21:00
400 మంది డిప్యూటీ ఎంపీడీవోలకు త్వరలో బాధ్యతలు
మున్సిపల్, జిల్లా స్థాయిలోనూ అధికారుల నియామకం
అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు మండల, మున్సిపల్, జిల్లా స్థాయిలో పర్యవేక్షకులొస్తున్నారు. తొలి దశలో మండల స్థాయిలో పర్యవేక్షక అధికారుల నియామకాన్ని త్వరలో చేపట్టనున్నారు. రెండో దశలో మున్సిపల్, జిల్లా స్థాయిలో అధికారులను కేటాయిస్తారు. ఈ నెలాఖరులోగా మొత్తం నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సచివాలయాలశాఖ యోచిస్తోంది. సచివాలయాలపై మండల స్థాయి పర్యవేక్షణాధికారులుగా రాష్ట్ర వ్యాప్తంగా 660 మంది డిప్యూటీ మండల పరిషత్ అధికారులను నియమించనున్నారు. గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులు, జడ్పీ, మండల కార్యాలయాల్లో పరిపాలన అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ డిప్యూటీ ఎంపీడీవోలుగా ఇటీవల పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. వీరందరి సేవలను డిప్యుటేషన్పై సచివాలయాలశాఖ వినియోగించుకోనుంది. పదోన్నతి పొందిన వారి జాబితా కొద్ది రోజుల క్రితం సచివాలయాలశాఖకు చేరింది.జిల్లా స్థాయి సచివాలయ పర్యవేక్షణాధికారులుగా జిల్లా పరిషత్ సీఈవో, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులను నియమించనున్నారు. ఇందులో 70% పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, మరో 30% పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల అధికారులను డిప్యుటేషన్పై సచివాలయాల శాఖ తీసుకుంటుంది. నెలాఖరులోగా వీరి నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.