ముఖ్య సమాచారం
-
రోజా, వైసీపీ కలిసి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు: షర్మిల ఆవేదన
-
జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్
-
సజ్జల రామకృష్ణారెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్
-
అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేసిన జాతీయ మహిళా కమిషన్..
-
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
తొలిసారిగా ఎమ్మెల్యేకు కార్యాలయం ఏర్పాటు
-
గుంటూరు జీజీహెచ్కు కొమ్మినేని శ్రీనివాసరావు
-
ఏపీపీఎస్సీ అక్రమాల కేసు.. ఐపీఎస్ ఆంజనేయులుకు హైకోర్టులో బెయిల్ నిరాకరణ
-
సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాకిస్థాన్లో నీటి సంక్షోభం
-
రేపు, ఎల్లుండి మండే ఎండలు.. ఉక్కపోత..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీస్ల ముట్టడి, తీవ్ర ఉద్రిక్తతలు
Updated on: 2025-06-09 15:02:00

అమరావతి మహిళల గురించి నీచంగా మాట్లాడటంపై సాక్షి మీడియా ఆఫీస్ల ఎదుట మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి మహిళలతోపాటు, టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా విభాగాలు ఏపీ వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ వైఎస్ జగన్ మీడియాపై నిప్పులు చెరుగుతున్నారు.
రాజధాని అమరావతి మహిళల గురించి సాక్షి ఛానల్లో కృష్ణంరాజు అనే వ్యక్తి నీచంగా మాట్లాడారని అమరావతి మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
'ఏ వెధవలు కూడా ఇలా వ్యాఖ్యలు చేయరు. రాజధాని మహిళలు అంటే నాలుగు జిల్లాల వారు ఉన్నారు. ఈ వ్యాఖ్యలను సాక్షి యాజమాన్యం కనీసం ఖండించలేదు. సాక్షితో పాటు, కొమ్మినేని, కృష్ణంరాజులపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. నేడు మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశాం. వారిని శిక్షించే వరకు మా పోరాటం ఆగదు. రాజధాని ప్రాంత మహిళలు 1630 రోజులు ఉద్యమం చేశారు. మళ్లీ అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు దేవతల రాజధాని అంటే... వేశ్యల రాజధాని అని కృష్ణంరాజు అనే కుక్క కూతలు కూశాడు. దానిని ఖండించాల్సిన కొమ్మినేని సిగ్గు లేకుండా సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేస్తున్నాం. కొమ్మినేని, కృష్ణంరాజులపై చర్యలు తీసుకొవాలి. మహిళలపై ఇంత నీచంగా మాట్లాడితే చర్యలు తీసుకోవడంలో ఆలస్యమెందుకు? మా భూములు రాజధాని కోసం ఇచ్చి అడ్డమైన వాళ్లతో తిట్టించుకుంటున్నాం.ఐదేళ్లుగా అమరావతిని చంపిన వైసిపి నేతలు ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారు. జగన్ను ధీటుగా ఎదుర్కొన్న మహిళల పోరాటపటిమ గుర్తించండి. ఆ అక్కసుతోనే ఇప్పుడు ఇలాంటి నీచ వ్యాఖ్యలు సాక్షి మీడియాలో మాట్లాడిస్తున్నారు. కొమ్మినేని, కృష్ణంరాజు ఇళ్లల్లో ఆడవాళ్లు ఉంటారనేది మరచిపోయారా? మా మహిళలు చేసిన పోరాటాలు, ఎదుర్కొన్న లాఠీఛార్జి, కేసులు ఎన్నో ఉన్నాయి. గత వైసిపి ప్రభుత్వంలో కూడా నీచంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ప్రజలంతా కలిసి జగన్కు బుద్ధి చెప్పినా.. ఇంకా అవే బూతులు, కూతలా? ప్రభుత్వం ఎందుకు కృష్ణంరాజును అరెస్టు చేయలేదు? వెంటనే ప్రభుత్వం, పోలీసులు దీని పై స్పందించాలి. అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి'. అంటూ రాజధాని మహిళలు డిమాండ్ చేశారు.