ముఖ్య సమాచారం
-
రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ కు ఆధార్ తప్పని సరి
-
ఏపీలో ‘విద్యార్థి మిత్ర కిట్'లు పంపిణీకు సిద్ధం...
-
ACలపై కేంద్రం కొత్త రూల్!
-
సాక్షి టివి పై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం.
-
విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించండి- కేంద్ర పౌర విమానయాన శాఖకు సీఎం చంద్రబాబు సూచన
-
కొత్త ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు
-
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి 'వందే భారత్ స్లీపర్'
-
బరిమల విమానాశ్రయం: భూసేకరణ కోసం రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయి సర్వే ప్రారంభించింది.
-
అందుబాటులోకి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు...!
-
రేపటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం.. కొత్త టైమింగ్స్ ఇవే..!
రోజా, వైసీపీ కలిసి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు: షర్మిల ఆవేదన
Updated on: 2025-06-10 20:40:00

సీఎం చంద్రబాబుకు తాను మద్దతు పలుకుతున్నానంటూ వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ, రోజాపై నిప్పులు చెరిగారు. రోజా ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
వైసీపీ నేతలు తనపై, తన తల్లి విజయమ్మపై గతంలో చేసిన దారుణమైన ప్రచారాన్ని గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందారు. "రోజా, వైసీపీ కలిసి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు. నా రక్త సంబంధమే నా మీద విష ప్రచారం చేసింది. నేను వైఎస్సార్కే పుట్టలేదని దారుణంగా ప్రచారం చేశారు. విజయమ్మకు నేను అక్రమ సంతానం అని కూడా ప్రచారం చేశారు. మీరు చేసిన ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యల వల్ల నేను ఎంతగా మానసిక క్షోభ అనుభవించి ఉంటానో ఆలోచించండి" అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో తన సోదరుడు కష్టాల్లో ఉన్నారని తెలియగానే, రక్త సంబంధానికి విలువ ఇచ్చి 3,200 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశానని షర్మిల గుర్తుచేశారు. "మీరు మనుషులు కాదు. రక్త సంబంధం గురించి మాట్లాడటానికి మీకు సిగ్గుండాలి. విజయమ్మను పార్టీ నుంచి బయటకు పంపిన రోజే మీ పతనానికి పునాది పడింది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలని కోరుతున్నాను" అని వైసీపీ నేతలను ఉద్దేశించి షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు.