ముఖ్య సమాచారం
-
ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మృతి
-
ఆ సీటులో కూర్చోవడం వల్లే ప్రాణాలతో బయటపడ్డాడు
-
విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం: అమిత్ షా
-
ఇరాన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. టెహ్రాన్లో భారీ పేలుళ్లు.. తీవ్ర ఉద్రిక్తత!
-
సచివాలయ ఉద్యోగులకు సొంత మండలాల్లో పోస్టింగ్ లేదు
-
లవ్ బ్రేకప్ అయ్యిందంటూ పంట పొలాల్లో మందేసి.. చిందేసిన విద్యార్థిని
-
భారత్కు ఇది కష్టకాలం.. ఆదుకుంటాం: ఎయిరిండియా ప్రమాదంపై ట్రంప్
-
విమాన ప్రమాదంలో 241 మంది మృతి.. ఒకరు మాత్రమే బతికారు: ఎయిరిండియా ప్రకటన
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం బలి
-
విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు..! రమేష్
రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ కు ఆధార్ తప్పని సరి
Updated on: 2025-06-12 08:23:00

రైల్వే తత్కాల్ టికెట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధననుతీసుకొచ్చింది.
కేవలం ఆధార్ ధ్రువీకరణ ఉన్న వ్యక్తులే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. 'ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే టికెట్ బుకింగ్ అవకాశం కల్పించాలి అని రైల్వే శాఖ తన సర్క్యులర్ లో పేర్కొంది.
జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ బేస్డ్ ఓటీపీ కూడా తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
గత ఆరు నెలల్లో 2.5 కోట్ల అనుమానాస్పద IRCTC IDలను బ్లాక్ చే సినట్లు రైల్వే శాఖ తెలిపంది.
టికెట్ బుకింగ్ కోసం బాట్ సాఫ్ట్వేర్లను ఉపయోగించినందుకు id లను బ్లాక్ చేశారు
ఈ అనధికార ఐడి లను ఏరివేయడానికి వ్యక్తిగత వినియోగదారులకు తత్కాల్ ఇ-టికెట్ బుకింగ్ కోసం ఆధార్ తప్పనిసరి చేశారు
రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే వ్యక్తుల మొబైల్కు వచ్చే ఆధార్ ఓటీపీఎ ఎంటర్ చేయాల్సి ఉంటుందని తన సర్క్యులర్ పేర్కొంది.
దీంతో పాటు ఆథరైజ్డ్ ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టంచేసింది.
అంటే ఏసీ తరగతులకు 10.30 గంటల తర్వాత, నాన్ ఏసీ కోచ్లకు 11.30 గంటల తర్వాత మాత్రమే టికెట్ బుకింగ్కు వెసులుబాటు కల్పించనున్నారు.
ఈ ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్ సిటీసీ తమ సిస్టమ్స్ లో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
అనధికారిక టికెట్ బుకింగ్లను నిలిపివేయడానికి గానూ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.