ముఖ్య సమాచారం
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
-
అందుకే నాకు మంటలు అంటుకోలేదు: విమాన ప్రమాద మృత్యుంజయుడు విశ్వాస్
-
జర్నలిస్టు కొమ్మినేనికి బిగ్ రిలీఫ్.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
-
ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మృతి
-
ఆ సీటులో కూర్చోవడం వల్లే ప్రాణాలతో బయటపడ్డాడు
-
విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం: అమిత్ షా
-
ఇరాన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. టెహ్రాన్లో భారీ పేలుళ్లు.. తీవ్ర ఉద్రిక్తత!
లవ్ బ్రేకప్ అయ్యిందంటూ పంట పొలాల్లో మందేసి.. చిందేసిన విద్యార్థిని
Updated on: 2025-06-13 08:25:00

గుడ్లవల్లేరు: లవ్ బ్రేకప్ అయ్యిందంటూ పంట పొలాల్లో ఫుల్లుగా మందు తాగేసి మత్తులో ఉన్న విద్యార్థినిని పోలీసులు స్టేషన్కు తరలించి తల్లితండ్రులకు అప్పగించిన వైనం ఇది.
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన ఒక యువతి రోజూ స్వగ్రామం నుంచి బస్సులో గుడ్లవల్లేరు వస్తూ ఇక్కడ ఒక కళాశాలలో చదువుతోంది. నాలుగు రోజుల కిందట మచిలీపట్నం-చిలకలపూడి బీచ్లో నిర్వహించిన ఫెస్టివల్కు వెళితే ఆమెకు అక్కడ గుడివాడ మండలానికి చెందిన ఒక యువకుడి పరిచయమయ్యాడు. గురువారం సాయంత్రం కళాశాల ముగిసిన తర్వాత విద్యార్థిని ఆ యువకుడికి ఫోన్ చేసి తన లవ్ బ్రేకప్ అయ్యింది..బాధగా ఉంది.. మందు తాగాలని ఉంది..తీసుకు రావాలని కోరింది. అతడు మద్యం బాటిల్ తీసుకురాగా ఇద్దరూ కలిసి అతడి బండిపై గుడ్లవల్లేరు-గుడివాడ మార్గంలో డొంకదారిలోకి వెళ్లారు. రైల్వేట్రాక్ దాటాక ఒక పొలం గట్టున కూర్చొని మందు తాగారు. ఆమె ఎక్కువగా తాగి మత్తులో కూరుకుపోయింది. చేలల్లో నుంచి లేచి నడవ లేని పరిస్థితి. దీంతో ఆ యువకుడు తన స్నేహితులకు సమాచారం ఇవ్వగా.. ఇద్దరు వచ్చారు. ఆమె కనీసం బండిపై కూడా కూర్చొనే పరిస్థితి లేకపోవడంతో ఇదంతా తనకెందుకని ఒక యువకుడు పారిపోయాడు.
దీంతో మిగిలిన ఇద్దరూ ఆమెను తీసుకు వచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. అదే సమయంలో గుడ్లవల్లేరుకు చెందిన ఒక యువకుడు అటుగా వెళుతూ వీరిని గమనించి ఆ విద్యార్థినిపై ఏ అఘాయిత్యం జరుగుతుందోనని భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫోన్లో వీడియో తీస్తుండగా అడ్డుకుని అతడి సెల్ఫోన్ను పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళా హోంగార్డులతో కలిసి వెళ్లి ఆమెను, వారిద్దర్ని ఆటోలో స్టేషన్కు తరలించారు. మత్తులోనే ఉన్న ఆమె స్టేషన్లో సిబ్బందిపైనా వీరంగం సృష్టించింది. ఆమెను నియంత్రించడం వారికి తల ప్రాణం తోక్కొచ్చినట్లయ్యింది. ఎట్టకేలకు ఆమె వివరాలు కనుక్కొని తల్లితండ్రులకు సమాచారం ఇచ్చి వారికిచ్చి పంపించేశారు. ఈ ఉదంతం స్థానికంగా చర్చనీయాంశమైంది.