ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
అందుకే నాకు మంటలు అంటుకోలేదు: విమాన ప్రమాద మృత్యుంజయుడు విశ్వాస్
Updated on: 2025-06-13 15:29:00

అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు విశ్వాస్కుమార్ రమేశ్.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ప్రమాద క్షణాలను (Air India Plane Crash) గుర్తుచేసుకున్నారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడి పడిందని, అందువల్లే తాను బతికిబయటపడ్డానన్నారు. ''నేను విమానం నుంచి దూకలేదు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ముక్కలైంది. నా సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడ్డా. అందుకే విమానంలో చెలరేగిన మంటలు నాకు అంటుకోలేదు'' అని విశ్వాస్ కుమార్ (Vishwash Kumar Ramesh) చికిత్స సమయంలో వైద్యులకు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఆయన శరీరంపై పలుచోట్ల గాయాలు అయ్యాయి. వాటినుంచి కోలుకుంటున్న ఆయన తాజాగా డీడీ న్యూస్ మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో విశ్వాస్ కుమార్ను పరామర్శిస్తున్న ప్రధాని మోదీ ''అంతా నా కళ్ల ముందే జరిగింది. ఎలా బతికానో నాకే అర్థం కాలేదు. విమానం కింద పడగానే నేను కూడా చనిపోయానని అనుకున్నా. కళ్లు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నా. శిథిలాల నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లా. మంటల ధాటికి నా ఎడమ చేయికి గాయమైంది'' అని విశ్వాస్ తెలిపారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ ప్రయాణికుడిని శుక్రవారం ప్రధాని మోదీ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విశ్వాస్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.