ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
Updated on: 2025-06-14 06:58:00

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఉద్యోగుల కరవు భత్యాన్ని (డీఏ) 3.64 శాతం పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఈ డీఏ 2023 జనవరి 1వ తేదీ నుంచే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులలో స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొంతకాలంగా డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెంచిన 3.64 శాతం డీఏతో ఉద్యోగుల మూల వేతనంపై అదనపు భత్యం కలవనుంది.