ముఖ్య సమాచారం
-
రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ కు ఆధార్ తప్పని సరి
-
ఏపీలో ‘విద్యార్థి మిత్ర కిట్'లు పంపిణీకు సిద్ధం...
-
ACలపై కేంద్రం కొత్త రూల్!
-
సాక్షి టివి పై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం.
-
విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించండి- కేంద్ర పౌర విమానయాన శాఖకు సీఎం చంద్రబాబు సూచన
-
కొత్త ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు
-
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి 'వందే భారత్ స్లీపర్'
-
బరిమల విమానాశ్రయం: భూసేకరణ కోసం రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయి సర్వే ప్రారంభించింది.
-
అందుబాటులోకి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు...!
-
రేపటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం.. కొత్త టైమింగ్స్ ఇవే..!
అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేసిన జాతీయ మహిళా కమిషన్..
Updated on: 2025-06-10 20:22:00

అమరావతిపై జగన్ మీడియా అసభ్య వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. జర్నలిస్ట్ వి.వి.ఆర్. కృష్ణం రాజు టీవీ డిబేట్ సందర్భంగా అమరావతిలోని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటాగా స్వీకరించింది. అమరావతిని “వేశ్యల రాజధాని”గా సంబోధించడం అనేది రాజధాని ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన మహిళా రైతులను తీవ్రంగా అవమానించడమేనని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. ఈ అసహ్యకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ విజయా రహట్కర్ తెలిపారు. తక్షణమే నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ జరిపి సంబంధిత చట్టాల ప్రకారం కృష్ణం రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 3 రోజుల్లోగా కృష్ణంరాజుపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను పంపించాలని కూడా డీజీపీకి ఆదేశాలు వెళ్లాయి.