ముఖ్య సమాచారం
-
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
-
మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్
-
చికెన్ కిలో రూ.800.. భారత్తో పెట్టుకుంటే ఇట్టే ఉంటుంది మరి
-
భారత్కు పాక్ మరోమారు బహిరంగ అణు హెచ్చరిక.. తీవ్రరూపం దాల్చుతున్న ఉద్రిక్తతలు
-
జైల్లో వంశీకి అస్వస్థత
-
ప్రపంచ యాత్రికుడు అన్వేష్పై హైదరాబాద్లో కేసు నమోదు
-
50 శాతం రాయితీపై పశువుల దాణా
-
ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
-
450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్
-
ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు : రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ
మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్
Updated on: 2025-05-04 09:57:00

గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి కొడాలికి చెందిన కే కన్వెన్షన్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. గుడివాడ కరెంట్ ఆఫీసులో విచారణ చేసిన ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు.. అప్పటి విద్యుత్ ఏడీ, డీఈలను ఆరా తీశారు. గుడివాడ పరిధిలోని లింగవరంలోని కే కన్వెన్షన్ దగ్గర విజిలెన్స్ సీఐ డీజీ గంగా భవాని సారథ్యంలోని సిబ్బంది ఎంక్వైరీ నిర్వహించారు. కొడాలి నాని కే.కన్వెన్షన్ నందు 2020లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు అప్పటి సీఎం జగన్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా.. ఆ వెంచర్ చుట్టూ విద్యుత్ స్తంభాలు, రెండు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అయితే.. అధికారికంగా 60 కరెంట్ స్తంభాలు ఉండగా.. వెంచర్లో 78 ఉన్నట్లు గుర్తించారు. ఈ లెక్కన 18 కరెంట్ స్తంభాలతోపాటు రెండు ట్రాన్స్ఫార్మర్స్ అక్రమంగా ఏర్పాటు చేసినట్లు తేల్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయన్నారు విజిలెన్స్ అధికారులు.