ముఖ్య సమాచారం
-
ఏపీపీఎస్సీ అక్రమాల కేసు.. ఐపీఎస్ ఆంజనేయులుకు హైకోర్టులో బెయిల్ నిరాకరణ
-
సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాకిస్థాన్లో నీటి సంక్షోభం
-
రేపు, ఎల్లుండి మండే ఎండలు.. ఉక్కపోత..
-
రెండు నెలల్లో సేవలన్నీ వాట్సప్లో: చంద్రబాబు
-
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యం..!!
-
తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్
-
హైదరాబాద్ లో జూన్-26 నుంచి బోనాల పండుగ
-
భర్తను హనీమూన్ ను తీసుకెళ్లి చంపేసింది
-
మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఏఎస్పీ మృతి....
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీస్ల ముట్టడి, తీవ్ర ఉద్రిక్తతలు
మరణించిన తమ తోటి సిబ్బంది కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్న 2003 బ్యాచ్ కానిస్టేబుల్స్.
Updated on: 2024-07-27 21:00:00

ఆర్థిక సహాయాన్ని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర రావు ఐపీఎస్ చేతుల మీదుగా కుటుంబానికి అందజేత. తమ తోటి సహచరుడికి కష్టం వస్తే ఆ కష్టం తమదిగా భావించి 2003 వ సంవత్సరం కానిస్టేబుల్స్ బ్యాచ్ కు చెందిన సిబ్బంది అందరూ కలిసి ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆసరా కల్పించాలనే ఆలోచనతో, పెనమలూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణంతో 14-10-2023 వ తేదీన మరణించిన హెడ్ కానిస్టేబుల్-2991 చండ్ర నాగరాజు కుటుంబానికి తమవంతుగా జట్టు స్ఫూర్తితో 63,000/- సమకూర్చి ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర రావు ఐపీఎస్ చేతులమీదుగా హెడ్ కానిస్టేబుల్ భార్య అనిత మరియు ఆయన కుమార్తె మోనాకు అందజేశారు. వారితో ఎస్పీ మాట్లాడుతూ ఆయన మృతి బాధాకరం అయినప్పటికీ, మీ కుటుంబానికి అండగా జిల్లా పోలీస్ శాఖ ఉందని ఏ సమయంలో ఏ సహాయం కావాలన్నా చేయటానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటామని, శాఖా పరంగా రావలసిన ప్రయోజనాలను త్వరితగతిన అమలయ్యేలా చూస్తామని తెలిపారు