ముఖ్య సమాచారం
-
పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ నిష్క్రమణ.. 25 ఏళ్ల బంధం తెగింది!
-
విజయవాడ హైవేపై ప్రమాదం.. ఒకేసారి ఢీకొన్న మూడు కార్లు
-
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద
-
జలకళ.. నిండుగా జలాశయాలు
-
ఉక్రెయిన్కు కొన్ని రకాల ఆయుధాల సరఫరా నిలిపివేత
-
సీఎం అభ్యర్థిగా హీరో విజయ్ పేరు ప్రకటించిన టీవీకే పార్టీ
-
ఏపీలో జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్
-
హిమాచల్లో జల ప్రళయం.. 37 మంది బలి, రూ.400 కోట్ల ఆస్తి నష్టం!
-
చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్కు షాకిచ్చిన భారత స్టార్ గుకేశ్
-
గన్నవరం సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ.. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయం
పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ నిష్క్రమణ.. 25 ఏళ్ల బంధం తెగింది!
Updated on: 2025-07-04 19:27:00

ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ లో సుమారు 25 ఏళ్లుగా కొనసాగుతున్న తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే జూలై 3 నుంచి ఆ దేశం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించింది. ఈ పరిణామం పాక్ టెక్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ చీఫ్గా ఉన్న జావాద్ రెహ్మాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిని 'ఒక యుగానికి ముగింపు'గా ఆయన అభివర్ణించారు. 2000వ సంవత్సరం మార్చి 7న పాక్లో అడుగుపెట్టిన మైక్రోసాఫ్ట్, సరిగ్గా 25 ఏళ్ల తర్వాత తన సేవలను ముగించింది.