ముఖ్య సమాచారం
-
డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ
-
నేడు రాష్ట్ర ప్రజలు గర్వపడే రోజు: సీఎం చంద్రబాబు
-
పాక్ తన గగనతలాన్ని ఏడాదిపాటు మూసేస్తే.. ఎయిరిండియాకు రూ.5,081 కోట్ల నష్టం!
-
తెరచుకున్న కేదార్ నాథ్ తలుపులు
-
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత
-
హైదరాబాద్లో మరో పెద్ద జూ పార్క్.. ఏకంగా 200 ఎకరాల్లో
-
భారత్లో కాగ్నిజెంట్ నియామకాలు: 20,000 ఫ్రెషర్లకు అవకాశం
-
'వేవ్స్' సమ్మిట్లో స్పెషల్ అట్రాక్షన్గా 'రామోజీ' స్టాల్
-
అటారీ-వాఘా సరిహద్దు పూర్తిగా మూసివేత
-
భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశం: ఫరూక్ అబ్దుల్లా
సీఎం చంద్రబాబును కలిసిన అనంత జిల్లా ఎమ్మెల్యేలు .. కీలక అంశంపై వినతి
Updated on: 2025-05-01 07:21:00

రాష్ట్రంలోని వివిధ గ్రామీణ ప్రాంతాలకు సేవలందిస్తున్న ఆర్డీటీకి విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించిన ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ను కేంద్రం నిలిపివేసిందని, దీని పునరుద్ధరణకు చొరవ తీసుకోవాలని ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, బండారు శ్రావణి, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ బుధవారం సీఎంను సచివాలయంలో కలిసి వినతిపత్రం అందించారు.ఉమ్మడి అనంతపురం జిల్లాలో విదేశీ విరాళాల ద్వారా ఆర్డీటీ నడుస్తోందని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లోనూ ఈ ట్రస్ట్ వైద్య సేవలు అందిస్తోందని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. లోకల్ కాంట్రిబ్యూషన్ ఖాతాలో నిధులు జమ చేయడం సమస్యగా మారిందని, ఈ నిధులను ఇతర ఎన్జీవో కార్యకలాపాలకు వాడుతున్నారన్న అభియోగంతో సంస్థ రిజిస్ట్రేషన్ను కేంద్రం నిలిపివేసిందని తెలిపారు. ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ను ఆర్డీటీ కోరుతోందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సాయం అందించాలని వారు కోరారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.