ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
చంద్రబాబుకు మద్దతుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న అఖిలప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డికి వైద్య పరీక్షలు
Updated on: 2023-09-22 21:55:00
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజు కొనసాగుతోంది. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద అక్కా తమ్ముడు దీక్ష చేపట్టారు. చంద్రబాబు బయటకు వచ్చే వచ్చే వరకూ.... దీక్ష విరమించేది లేదని అఖిల ప్రియ స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్టు చేశారని అఖిల ప్రియ ఆరోపించారు.
నంద్యాలలో ఆమరణ దీక్ష చేస్తున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమరణ నిరాహార దీక్షకు దిగి 30 గంటలు అయిందని, షుగర్ లెవెల్స్ బాగా తగ్గాయని వైద్యులు తెలిపారు. దీక్ష ఇలాగే కొనసాగిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని వైద్యులు చెప్పారు.