ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
చంద్రబాబుకు మద్దతుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న అఖిలప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డికి వైద్య పరీక్షలు
Updated on: 2023-09-22 21:55:00

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజు కొనసాగుతోంది. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద అక్కా తమ్ముడు దీక్ష చేపట్టారు. చంద్రబాబు బయటకు వచ్చే వచ్చే వరకూ.... దీక్ష విరమించేది లేదని అఖిల ప్రియ స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్టు చేశారని అఖిల ప్రియ ఆరోపించారు.
నంద్యాలలో ఆమరణ దీక్ష చేస్తున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమరణ నిరాహార దీక్షకు దిగి 30 గంటలు అయిందని, షుగర్ లెవెల్స్ బాగా తగ్గాయని వైద్యులు తెలిపారు. దీక్ష ఇలాగే కొనసాగిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని వైద్యులు చెప్పారు.