ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
Updated on: 2026-01-24 18:15:00
ఉపాధ్యాయులకు ఏప్రిల్, మే నెలల్లో బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఉపాధ్యాయ సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో అధికారులు పలు అంశాలను వెల్లడించారు. హైస్కూల్ ప్లస్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, వేసవి సెలవుల్లో పని చేసిన టీచర్లకు ఆర్జిత సెలవులు ఇవ్వనున్నామని తెలిపారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు వారం రోజుల్లో ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రెగ్యులర్ ఖాళీలు భర్తీ అయ్యే వరకు క్లస్టర్ టీచర్స్ పాఠ శాలలు మారుతూ ఉండాల్సి ఉంటుందని, బదిలీల కౌన్సెలింగ్లో పాత పాయింట్లు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో ఇక నుంచి ప్రతి వారం సమావేశాలు నిర్వహిస్తామని, జీతాల సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పదోన్నతులు ఎస్జీటీలకు 30:70 నిష్పత్తిలో చేపడతామని అధికారులు తెలపగా 70:30 నిష్పత్తి ప్రకారం కల్పించాలని సంఘాల నేతలు కోరారు.