ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
లంచము తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన జలకనూరు వీఆర్ఓ వెంకట రమణారెడ్డి
Updated on: 2023-09-14 10:28:00
నంద్యాల జిల్లా మిడుతూరు మండలము జలకనూరు గ్రామానికి చెందిన వెంకట రమణయ్య తన ముగ్గురు కూతుర్ల పేరిట తన భూమిని దాన విక్రయముగా రిజిస్టరు చేయించాడు.సదరు భూమిని తన పేరు నుండి వారి పేర్లపై ఆన్లైన్ నందు మార్పు చేసి పాసు బుక్కులు ఇవ్వడానికి గాను వీఆర్వో వెంకట రమణా రెడ్డి అనే ఫిర్యాదు ధారుడైన వెంకట రమణయ్య అనే వ్యక్తి నుండి 10000/- రూపాయలు లంచము ఆశించి ముందుగా 3000/- రూపాయలు తీసుకుని మిగిలిన 7000/- రూపాయలు లంచము మిడుతూరు గ్రామంలోని తన ప్రైవేటు కార్యాలయము నందు తీసుకుంటూ ఉండగా బుధవారము నాడు ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.ఈ దాడులలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు తేజేశ్వర్ రావు,వెంకట కృష్ణారెడ్డి,ఇంతియాజ్ అహ్మద్, కృష్ణయ్య,వంశినాథ్ మరియు సిబ్బంది పాల్గొన్నారని కర్నూలు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలియజేశారు.ప్రజలకు ఏసీబీ డీఎస్పీ విజ్ఞప్తి మీ చట్టబద్దమైన పనిని చేయడానికి ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచము ఆశిస్తే ముందుగా 14400 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి గాని 14400 మొబైల్ ఆప్ ద్వారాగాని సమాచారమును అందించగలరు.సదరు లంచగొండి అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడునని కర్నూలు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి కోరారు.