ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
దేహదారుఢ్య పరీక్షలకు 1136 మంది అభ్యర్థులు హాజరు
Updated on: 2023-09-14 07:43:00

ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న సివిల్ ఎస్ఐ, ఏఆర్ ఎస్ఐ, ఏపీఎస్పీ పోస్టుల భర్తీకి స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గతనెల 25 నుంచి అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం 1136 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరికి 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగుపందెం, లాంగ్జంప్, ఎత్తు, ఛాతీ కొలతలు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన హాజరు కావాల్సిన అభ్యర్ధులు వర్షకారణంగా వారిని 14వ తేదీన హాజరు కావాలని ఇప్పటికే సూచించారు. చివరి రోజు 15వ తేదీన కూడా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని డీఐజీ జీవీజీ అశోక్కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన పోలీసు పెరేడ్ గ్రౌండ్ను స్వయంగా పరిశీలించారు. చిన్న చిన్న గుంతలు ఉంటే వాటిలో మట్టి పోయించి చదును చేయించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆయనే స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకున్నారు.