ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
దేహదారుఢ్య పరీక్షలకు 1136 మంది అభ్యర్థులు హాజరు
Updated on: 2023-09-14 07:43:00

ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న సివిల్ ఎస్ఐ, ఏఆర్ ఎస్ఐ, ఏపీఎస్పీ పోస్టుల భర్తీకి స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గతనెల 25 నుంచి అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం 1136 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరికి 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగుపందెం, లాంగ్జంప్, ఎత్తు, ఛాతీ కొలతలు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన హాజరు కావాల్సిన అభ్యర్ధులు వర్షకారణంగా వారిని 14వ తేదీన హాజరు కావాలని ఇప్పటికే సూచించారు. చివరి రోజు 15వ తేదీన కూడా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని డీఐజీ జీవీజీ అశోక్కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన పోలీసు పెరేడ్ గ్రౌండ్ను స్వయంగా పరిశీలించారు. చిన్న చిన్న గుంతలు ఉంటే వాటిలో మట్టి పోయించి చదును చేయించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆయనే స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకున్నారు.