ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి ... నిజామాబాద్ కలెక్టర్
Updated on: 2023-08-31 09:42:00

జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం కింద నమోదైన కేసుల విచారణ వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను కోరారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్.. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న కేసులపై అధికారులు దృష్టి సారించాలని, కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి నిర్ణీత గడువులోగా చార్జిషీటు దాఖలు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ మండలాల్లో డివిజన్ల వారీగా అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షిస్తూ గత కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.