ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పల్లె ప్రకృతి వనాలలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
Updated on: 2023-04-29 22:21:00
ప్రజలకు స్వచ్ఛమైన సహజవాయువు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పల్లె ప్రకృతి వనాలలో మొక్కల సంరక్షణకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. శనివారం జిల్లాలోని జైనురు మండలం కాసిపేట, మర్కగూడ, బాబుల్ గూడ, మామడ గ్రామాలలో నిర్వహిస్తున్న పల్లె ప్రకృతి వనాలు, గ్రామపంచాయతీ నర్సరీలు, మిషన్ భగీరథ, హెల్త్ వెల్నెస్ సెంటర్ పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలలో నాటిన మొక్కలకు సకాలంలో నీటిని అందించి సంరక్షించాలని, చనిపోయిన వాటి స్థానంలో నూతన మొక్కలు నాటాలని తెలిపారు. గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న నర్సరీలలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను సిద్ధం చేయాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా జిల్లాలోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అందించి శుద్ధ జలం సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం మొదటి విడతలు భాగంగా ఎంపికైన పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలోగా సిద్ధం చేయాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం, తలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.