ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
అయ్యబాబోయ్ ...సారూ.. నా గుడిసెకు రూ. 3,31,951 కరెంటు బిల్లు ఎట్టా వచ్చిందో కాస్త సెప్పండీ?..నోరు ఎల్ల బెట్టిన ..బాధితుడు
Updated on: 2023-07-11 11:38:00

ఓ సాధారణ ఆటో డ్రైవర్ ఇంటికి ఏకంగా రూ. మూడున్నర లక్షల కరెంట్ బిల్లు రావడంతో కళ్లు తేలేశాడు. చిన్నపూరి గుడిసెకు అంతపెద్ద మొత్తంలో కరెంటు బిల్లు రావడంతో లబోదిబో మంటూ అధికారులకు మొరపెట్టుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్ రాయవరం మండలంలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని ఎస్ రాయవరం పరిధిలోని గోకులపాడు దళిత కాలనీలోని పూరి గుడిసెలో రాజుబాబు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇంత చిన్న పూరి గుడిసెకు అంత పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు రావడంతో రాజుబాబు కుటుంబ సభ్యులందరూ షాక్కు గురయ్యారు. దీనిపై విద్యుత్తు అధికారులను సంప్రదించగా.. సాంకేతిక సమస్య వల్ల పెద్ద మొత్తంలో బిల్లు వచ్చినట్లు గుర్తించారు. అనంతరం బిల్లును సరిచేసి ఈ నెల కరెంట్ బిల్లు రూ.155 వచ్చిందని తెలియజేశారు. సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందని, రాజుబాబుకి ఎస్సీ రాయితీ ఉండడంతో బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని కొరుప్రోలు సెక్షన్ ఏఈ గోపి వివరించారు.