ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
రాష్టం లో త్వరలో 190 కొత్త 108 వాహనాలు ప్రారంభం ..వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
Updated on: 2025-10-16 10:15:00
గాయాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. గాయపడిన వ్యక్తి బతికే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ అత్యవసర వైద్య సహాయం అందించాలంటే.. అంబులెన్స్లు కీలకం. అయితే రాష్ట్రంలో అంబులెన్స్ల కొరత ఉంది. ఉన్నవాటిలోనూ కొన్ని అంబులెన్స్లు తరచూ రిపేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో 190 కొత్త 108 వాహనాలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
గోల్డెన్ అవర్లోపే వైద్యం..
ఇప్పుడున్న అంబులెన్స్లతో పాటు కొత్తగా ప్రారంభించనున్న 190 కొత్త అంబులెన్స్లు.. రోగులు, క్షతగాత్రులను మరింత వేగంగా ఆస్పత్రులకు తరలించేందుకు వీలవుతుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్వహణ సరిగా లేక.. డొక్కు, తుక్కుగా తయారై.. తరచూ రిపేర్ అవుతున్న అంబులెన్స్లను తొలగిస్తామని చెప్పారు. వాటి స్థానంలో కొత్త అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఫలితంగా గోల్డెన్ అవర్లోనే క్షతగాత్రులు వైద్యం సహాయం పొందుతారన్నారు.