ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
డీఎస్సీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో భారీ సభ
Updated on: 2025-09-13 16:16:00
ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నియామకాలపైన మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాల జారీ ముహూర్తం ఖరారైంది. మొత్తంగా 16,347 ఉద్యోగాల మెగా డీఎస్సీ తుది జాబితా ఈ నెల 15న విడుదల కానుంది. 19న అమరావతిలో సభ ఏర్పాటు చేసి ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. వీరికి దసరా సెలవుల్లో శిక్షణ ఇచ్చి... ఆ తరువాత విధుల్లో చేరేలా కార్యాచరణ ఖరారు చేసారు
డీఎస్సీలో ఎంపికైన వారికి పోస్టింగ్స్ పై ఏపీ విద్యాశాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 15న ఎంపికైన తుది జాబితా ప్రకటించనుంది. ఈ నెల 19న అమరావతిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఈ క్రమంలోనే 19వ తేదీన సభ నిర్వహించి.. అక్కడే ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు అమరావతితో సచివాలయం సమీపంలో ఏర్పాట్లు చేస్తున్నారు.