ముఖ్య సమాచారం
-
మీపై కేసు నమోదైంది.. డిజిటల్ అరెస్టు చేస్తున్నాం.. అంటే భయపడకండి..
-
:చైనాలో ప్రధాని మోదీ, పుతిన్ హృదయపూర్వక ఆలింగనం
-
ఆర్టీసీ కీలక నిర్ణయం.. డ్రైవర్లు ఫోన్లు వాడకంపై నిషేధం
-
ఆఫ్ఘనిస్థాన్లో భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
-
భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు
-
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడిగింపు
-
భారత్- చైనా సంబంధాలు పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నాయి: జిన్ పింగ్ తో భేటీలో మోదీ వ్యాఖ్య
-
గ్రౌండ్ బుకింగ్ ఉండే బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
-
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
నాలుగో రోజుకు చేరుకున్న గణపతి నవరాత్ర మహోత్సవాలు... శ్రీ వీర గణపతిగా దర్శనమిచ్చిన స్వామివారు
Updated on: 2025-08-30 09:32:00

గుడివాడ పట్టణంలో ప్రాముఖ్యత కలిగిన మెయిన్ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్ర మహోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. శనివారం శ్రీ వీర గణపతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారికి వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శివ జ్యోతి నృత్యాలయం కళాకారులు నిర్వహించిన కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కళాకారులకు దేవస్థానం చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు దేవదాయ శాఖ సర్టిఫికెట్లను అందించారు.
ఉత్సవాల ఐదో రోజు ఆదివారం శ్రీ పంచముఖ అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని కమిటీ చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు తెలియజేశారు. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.