ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
బొబ్బిలి మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలి
Updated on: 2025-06-29 20:41:00

బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మరడ రామినాయుడు ఆధ్వర్యంలో అద్యక్షులు రేవళ్ళ కిరణకుమార్ పర్యవేక్షణలో ఆదివారం పాత కోటలో గల సంఘం కార్యాలయంలో మాజీ సైనికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేశారు.మాజీ సైనికులకు ఇంతవరకు ఇళ్ల స్థలాలు కానీ , ఉపాధి అవకాశాలు కానీ ప్రభుత్వం నుండి అందడం లేదని తెలిపారు. జిల్లా సైనిక అధికారి ద్వారా మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేద్దామని సూచించారు. దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన సైని కుటుంబాలకు సహకారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రెడ్డి రామకృష్ణ , కార్యవాక కార్యదర్శి ఎస్ ఆర్ మోహన్ రావు, ట్రెజరర్ శర్మ , బొబ్బిలి మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు.