ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. గిన్నిస్ రికార్డు కోసం భారీ సన్నాహాలు
Updated on: 2025-06-11 21:06:00

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. "యోగాంధ్ర" పేరుతో విశాఖపట్నం కేంద్రంగా జరగనున్న ఈ మహా కార్యక్రమంలో ఏకంగా 5 లక్షల మంది పాల్గొనేలా ప్రణాళికలు రచించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరుకానుండటంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భారీ యోగా ప్రదర్శన ద్వారా సూరత్లో నెలకొల్పిన గిన్నిస్ ప్రపంచ రికార్డును అధిగమించడంతో పాటు, 108 సూర్య నమస్కారాలతో మరో ప్రపంచ రికార్డును నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు యోగాంధ్ర నోడల్ అధికారి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు తెలిపారు.