ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
వరితో సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు
Updated on: 2025-05-29 05:58:00

భారతదేశంలోని అన్నదాతలకు గుడ్ న్యూస్... కేంద్రంలోని మోదీ సర్కార్ వరికి కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటన చేశారు.
రాబోయే ఖరీఫ్ 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం వరికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాల్కు రూ. 69 పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీంతో వరి (సాధారణ రకం) ఎంఎస్పీ క్వింటాల్కు రూ. 2,369కి చేరుకుంది. ఇక, వరి (గ్రేడ్ ఏ) ఎంఎస్పీని కూడా రూ. 69 పెంచడంతో క్వింటాల్ ధర రూ. రూ. 2,389కి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది.
వరితో పాటు మొత్తం 14 ఖరీఫ్ పంటలకు సవరించిన ఎంఎస్పీలను కూడా కేబినెట్ ఆమోదించింది. అత్యధికంగా నైజర్ సీడ్ క్వింటాలుకు రూ. 820, క్వింటాలు రాగి రూ. 596, క్వింటాల్ పత్తి రూ. 589, క్వింటాల్ నువ్వులు రూ. 579 పెంపునకు సీసీఈఏ ఆమోదం తెలిపింది.