ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
వరితో సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు
Updated on: 2025-05-29 05:58:00
భారతదేశంలోని అన్నదాతలకు గుడ్ న్యూస్... కేంద్రంలోని మోదీ సర్కార్ వరికి కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటన చేశారు.
రాబోయే ఖరీఫ్ 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం వరికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాల్కు రూ. 69 పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీంతో వరి (సాధారణ రకం) ఎంఎస్పీ క్వింటాల్కు రూ. 2,369కి చేరుకుంది. ఇక, వరి (గ్రేడ్ ఏ) ఎంఎస్పీని కూడా రూ. 69 పెంచడంతో క్వింటాల్ ధర రూ. రూ. 2,389కి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది.
వరితో పాటు మొత్తం 14 ఖరీఫ్ పంటలకు సవరించిన ఎంఎస్పీలను కూడా కేబినెట్ ఆమోదించింది. అత్యధికంగా నైజర్ సీడ్ క్వింటాలుకు రూ. 820, క్వింటాలు రాగి రూ. 596, క్వింటాల్ పత్తి రూ. 589, క్వింటాల్ నువ్వులు రూ. 579 పెంపునకు సీసీఈఏ ఆమోదం తెలిపింది.