ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
పగలు కొత్తిమీర, కరివేపాకు అమ్ముతూ.... రాత్రులు చోరీలు
Updated on: 2025-05-24 14:03:00

పగలు కొత్తిమీర కరేపాకు అమ్ముతూ.... రాత్రుళ్ళు చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను గుడివాడ డిఎస్పి ధీరజ్ వినీల్ మీడియా సమావేశంలో వెల్లడించారు.పమిడిముక్కల, కూచిపూడి పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ముఠా సభ్యులను పట్టుకున్నారు.వారి వద్ద 3 లక్షలు విలువైన 26 గ్రాములు బంగారం.....562 గ్రాముల వెండి ,3500 నగదు ,రెండు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలియజేశారు. ముఠా సభ్యులపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని,నిందితుల్లో ఒకరు మైనర్ కావడం విశేషమన్నారు.పగలు కొత్తిమీర కరివేపాకు అమ్ముతున్నట్లు ఊర్లలో తిరుగుతూ, తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రిళ్ళు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని గుడివాడ డిఎస్పి ధీరజ్ వినీల్ తెలియజేశారు.