ముఖ్య సమాచారం
-
ఏపీలో మైనారిటీలకు రూ.1 లక్ష నుంచి 8 లక్షలవరకు రుణాలు
-
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ముగ్గురు సైనికులు మ
-
యుద్ధం వస్తే 4 రోజుల్లో పాకిస్థాన్ వద్ద మందుగుండు ఖాళీ!
-
రాగల రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు... ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
-
హడలిపోతున్న దాయాది దేశం... భారత వాయుసేన దాడి చేస్తుందేమోనన్న పాక్ మంత్రి
-
శ్రీ మహంకాళి అమ్మవారికి సారె సమర్పించిన మంత్రి నారా లోకేశ్
-
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. వారందరికీ ప్రమోషన్లు!
-
పాక్కు మరో షాక్.. డ్యామ్ గేట్లు క్లోజ్ చేసిన భారత్
-
పెనమలూరు: ఆటోపై కూలిన భారీ వృక్షం
-
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
శ్రీ మహంకాళి అమ్మవారికి సారె సమర్పించిన మంత్రి నారా లోకేశ్
Updated on: 2025-05-04 17:53:00

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. దుగ్గిరాల మండలం కంఠంరాజ కొండూరు గ్రామంలోని శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానం పునఃప్రతిష్ట మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న మంత్రి లోకేశ్ కు ఆలయ అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ తొలుత అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, సారెను సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనాలు అందించి, జ్ఞాపికను బహూకరించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్టించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలను కూడా మంత్రి సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు జరిపారు. మంత్రి రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, భక్తులు ఆలయానికి తరలివచ్చారు.