ముఖ్య సమాచారం
-
చైనాలో ఓ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం... 22 మంది మృతి
-
మోడీ సంచలన నిర్ణయం.. రంగంలోకి త్రివిధ దళాలు..
-
ఏపీలోనూ మావోయిస్టుల కలకలం... అల్లూరి జిల్లాలో కాల్పులు
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
చైనాలో ఓ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం... 22 మంది మృతి
Updated on: 2025-04-29 21:22:00

చైనాలో మరో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లియావోయాంగ్ నగరంలోని ఓ రెస్టారెంట్లో మంగళవారం మధ్యాహ్నం చెలరేగిన భారీ అగ్నికీలలు 22 మందిని బలిగొన్నాయి. మరో ముగ్గురు ఈ దుర్ఘటనలో గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో రెస్టారెంట్ భవనం నుంచి దట్టమైన పొగ, మంటలు ఎగిసిపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. రెండు, మూడు అంతస్తుల భవనంలో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.