ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి #
Updated on: 2025-04-22 21:22:00
గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గల స్థానిక టిడ్కో కాలనీ నందు బ్లాక్ నంబర్ A-26 వద్ద ఈరోజు అనగా 22 04.2025 ఉదయం సుమారు 11.00 గంటల సమయంలో నారి సంతోష్ s/o చంటి, వయసు 14సం, జగనన్న కాలనీ, గుడివాడ అనే పిల్లవాడు తన తల్లి యొక్క ఆదేశం మేరకు వారి యొక్క మూసి వేయబడిన చికెన్ పకోడీ కొట్టు దగ్గరకు గ్యాస్ పొయ్యి తీసుకువచ్చే నిమిత్తం వెళ్లి సదరు కొట్టు గుంజకు కట్టబడి వేలాడుతున్న కొట్టు గుంజకు కట్టి వేలాడుతున్న GA వైరు కు తగిలి దానికి పైన ఉన్న విద్యుత్ వైరు ద్వారా విద్యుత్ సరఫరా అవుతూ ఉన్నందున అతనికి షాక్ తగలగా పక్కనే ఉన్న దొండపాటి రవితేజ అనే యువకుడు పిల్లవాడిని కాపాడే ప్రయత్నం చేసి అతడిని విడిపించగా రవితేజ కు పక్కనే ఉన్న విద్యుత్ వైరు వీపు భాగంలో తాకి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి, అతడిని కాపాడేందుకు మరో ముగ్గురు కొవ్వూరు నాగరాజు s/o వీరయ్య, వయసు 45సం, ద్రోణాదుల వీధి, పీట రామస్వామి s/o శివనగరాజు, వయసు 40సం, కాజా, మొవ్వ మండలం, మరియు షేక్ మస్తాన్, నందిగామ అను వారు ప్రయత్నం చేయగా వారికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయి, వెంటనే విద్యుత్ షాక్ తగిలిన వారిని గుడివాడ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సుమారు 12 .00 గంటల సమయంలో దొండపాటి రవితేజ s/o వెంకట్రావు, వయసు 27సం, కులం- వడ్డెర, రమణ కాలనీ, నందిగామ ప్రస్తుత నివాసం TIDCO అనే యువకుడు మృతి చెందినాడు అతను ప్రస్తుతం గుడివాడ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నిమిత్తం గుడివాడ వచ్చి ఉంటున్నాడు, మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు, దీనిపై గుడివాడ తాలూకా ఎస్ఐ శ్రీ నంబూరి చంటి బాబు గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.