ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
రెబ్బెన మండలంలోని జక్కులపల్లి గ్రామంలో జరిగిన ఇద్దరి హత్య కేసులో 13 మంది నిందితులు అరెస్ట్
Updated on: 2023-06-29 07:30:00

వివరాల్లోకి వెళితే .... మండల బక్కయ్య కు జక్కులపల్లి గ్రామా శివారులో వ్యవసాయ భూమి కలదు. ఇటీ భూమి విషయంలో బక్కయ్య కుటుంబికులకు మరియు మండల మెంగయ్య కుటుంబికులకు గొడవలు జరుగుతున్నవి. Dt 25/06/2023 రోజున బక్కయ్య వాళ్ళు పత్తి విత్తనాలు వేసినారు. అది తెలిసిన మండల మెంగయ్య అతని కుటుంబ సభ్యులు/నిందితులు Dt 26/06/2023 రోజున కత్తులు, గొడ్డలితో, రాళ్లతో, కారంపొడితో, ఆ భూమిలోకి వెళ్ళినారు. అది చుసిన బక్కయ్య అతని కుటుంబ సభ్యులు వారిని ఆపడానికి వెళ్ళినపుడు నిందితులు అట్టి కత్తులు, గొడ్డలితో, రాళ్లతో, కారంపొడితో బక్కయ్య కుటుంబసభ్యులపై దాడి చేసినారు. ఈ దాడి లో మండల నర్సయ్య,గీరుగుల బక్కక్క మృతి చెందినారు. మిగతావారికి రక్త గాయాలు అయినవి. తర్వాత నిందితులు అక్కడినుండి పారిపోయినారు. ఈ విషయమై మండల ఇందిరా పిర్యాదు మేరకు రెబ్బెన PS నందు Cr No 90/2023 , U/sec 143, 147, 148, 302, 307 r/w 149 IPC ప్రకారం కేసు నమొదు చెసారు ఈ కేసుని చేదించడంలో శ్రీ సురేష్ కుమార్ IPS ఆదేశాలమేరకు సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు శ్రీ అల్లెం నరేందర్ CI రెబ్బెన , భూమేష్ SI రెబ్బెన గారులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 13 మంది నిందితులను అరెస్ట్ చేసి ఈరోజు ఆసిఫాబాద్ కోర్ట్ నందు హాజరుపరచారు