ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ
Updated on: 2025-04-03 19:53:00

దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మండల యాదవ కురుమ సంఘం ఆధ్వర్యంలో 98 వ జయంతిని పురస్కరించుకొని ఒగ్గు డోలు కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ర్యాలీతో వచ్చి తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాగం నాగరాజు మాట్లాడుతూ కొమరయ్య 1927 ఏప్రిల్ 3న తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకందార్ల కుటుంబంలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడయ్యాడు. 1946 జులై 4 న విసునూర్ రామచంద్రారెడ్డి అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వచ్చారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గునపాలు అందుకుని గుండాలను తరిమికొట్టారు. దొర గుండాల తుపాకి తూటాలకు నేలరాలిన అరుణతార, తెలంగాణ విప్లవంలో చెరగని ముద్రవేసుకున్నాడు దొడ్డి కొమురయ్య అని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, యస్ఐ గణేష్, కోడె శ్రీనివాస్, అధికార ప్రతినిధులు, మండలంలోని వివిధ పార్టీల నాయకులు మరియు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు