ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ
Updated on: 2025-04-03 19:53:00
దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మండల యాదవ కురుమ సంఘం ఆధ్వర్యంలో 98 వ జయంతిని పురస్కరించుకొని ఒగ్గు డోలు కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ర్యాలీతో వచ్చి తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాగం నాగరాజు మాట్లాడుతూ కొమరయ్య 1927 ఏప్రిల్ 3న తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకందార్ల కుటుంబంలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడయ్యాడు. 1946 జులై 4 న విసునూర్ రామచంద్రారెడ్డి అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వచ్చారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గునపాలు అందుకుని గుండాలను తరిమికొట్టారు. దొర గుండాల తుపాకి తూటాలకు నేలరాలిన అరుణతార, తెలంగాణ విప్లవంలో చెరగని ముద్రవేసుకున్నాడు దొడ్డి కొమురయ్య అని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, యస్ఐ గణేష్, కోడె శ్రీనివాస్, అధికార ప్రతినిధులు, మండలంలోని వివిధ పార్టీల నాయకులు మరియు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు