ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ
Updated on: 2025-04-03 19:53:00
దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మండల యాదవ కురుమ సంఘం ఆధ్వర్యంలో 98 వ జయంతిని పురస్కరించుకొని ఒగ్గు డోలు కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ర్యాలీతో వచ్చి తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాగం నాగరాజు మాట్లాడుతూ కొమరయ్య 1927 ఏప్రిల్ 3న తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకందార్ల కుటుంబంలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడయ్యాడు. 1946 జులై 4 న విసునూర్ రామచంద్రారెడ్డి అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వచ్చారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గునపాలు అందుకుని గుండాలను తరిమికొట్టారు. దొర గుండాల తుపాకి తూటాలకు నేలరాలిన అరుణతార, తెలంగాణ విప్లవంలో చెరగని ముద్రవేసుకున్నాడు దొడ్డి కొమురయ్య అని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, యస్ఐ గణేష్, కోడె శ్రీనివాస్, అధికార ప్రతినిధులు, మండలంలోని వివిధ పార్టీల నాయకులు మరియు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు