ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యుల సర్వసభ్య సాధారణ సమావేశం
Updated on: 2025-03-31 21:18:00

బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మరడ రామి నాయుడు అధ్యక్షతన అధ్యక్షులు రేవళ్ల కిరణకుమార్ పర్యవేక్షణలో బొబ్బిలి పాతకోట లో గల సంఘం కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల నిర్వహించిన జిల్లా సైనిక అధికారి నిర్వహించిన క్యాంప్ సదస్సుపై చర్చించారు. క్యాంప్ విజయవంతంగా మీ అందరి సహాయ సహకారాలతో జరిగిందని అధ్యక్షులు తెలియజేశారు. ట్రెజరర్ వి ఎన్ శర్మ మార్చి నెల లో జరిగిన రాబడి, ఖర్చుల వివరాలు సభ్యులకు తెలియజేశారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ సంఘము యొక్క అను శాసనం, కార్యనిర్వహణ ,సభ్యుల హాజరు, మంత్లీ సబ్ స్క్రిప్షన్.. తదితర అంశాలపై కూలంకషంగా వివరించారు.చివరగా గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ సభ్యులందరూ కోపరేటివ్ గా ఉండాలని, కార్యాలయ మెయింటినెన్స్ ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రతి మీటింగుకు సభ్యులందరూ హాజరు కావాలని, ప్రతినెలా కటింగ్ అందరూ జమ చేయాలని.. సూచించారు. సభ్యుల వద్ద నుంచి ఇంకా ఏ సజెషన్ పాయింట్ లేనందున సమావేశం 7 గంటలకు ముగిసినది. ఈ సమావేశంలో బొబ్బిలి పరిసర ప్రాంతాల పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు.