ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యుల సర్వసభ్య సాధారణ సమావేశం
Updated on: 2025-03-31 21:18:00

బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మరడ రామి నాయుడు అధ్యక్షతన అధ్యక్షులు రేవళ్ల కిరణకుమార్ పర్యవేక్షణలో బొబ్బిలి పాతకోట లో గల సంఘం కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల నిర్వహించిన జిల్లా సైనిక అధికారి నిర్వహించిన క్యాంప్ సదస్సుపై చర్చించారు. క్యాంప్ విజయవంతంగా మీ అందరి సహాయ సహకారాలతో జరిగిందని అధ్యక్షులు తెలియజేశారు. ట్రెజరర్ వి ఎన్ శర్మ మార్చి నెల లో జరిగిన రాబడి, ఖర్చుల వివరాలు సభ్యులకు తెలియజేశారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ సంఘము యొక్క అను శాసనం, కార్యనిర్వహణ ,సభ్యుల హాజరు, మంత్లీ సబ్ స్క్రిప్షన్.. తదితర అంశాలపై కూలంకషంగా వివరించారు.చివరగా గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ సభ్యులందరూ కోపరేటివ్ గా ఉండాలని, కార్యాలయ మెయింటినెన్స్ ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రతి మీటింగుకు సభ్యులందరూ హాజరు కావాలని, ప్రతినెలా కటింగ్ అందరూ జమ చేయాలని.. సూచించారు. సభ్యుల వద్ద నుంచి ఇంకా ఏ సజెషన్ పాయింట్ లేనందున సమావేశం 7 గంటలకు ముగిసినది. ఈ సమావేశంలో బొబ్బిలి పరిసర ప్రాంతాల పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు.