ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
కడిపికొండ,మైనారిటీ బాలుల గురుకుల పాఠశాలలో వసతులను తనిఖీ చేసిన హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి
Updated on: 2025-03-26 17:12:00
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ పరిధిలో ఉన్న తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలోని వసతులను హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు.పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన భోజన పదార్థాలను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. అదేవిధంగా స్టోర్ రూమ్ లో భద్రపరిచిన బియ్యం సంచులు, వంట నూనెలు, ఆహార పదార్థాలను పరిశీలించారు. గురుకుల పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం , ఇతర ఆహార పదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నారా అని అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలు ఉండాలని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులు, పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులకు సూచించారు.