ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పేట మెడికల్ షాపుల పై ఆపరేషన్ గరుడ...
Updated on: 2025-03-22 08:24:00
అనుమతులు లేని ఔషధాల నిల్వలను భారీగా గుర్తించిన అధికారులు...
దాడుల్లో పాల్గొన్న ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ అధికారులు...
నరసరావుపేట: జిల్లా కేంద్రం నరసరావుపేటలో మెడికల్ షాపులు, ఏజెన్సీలపై శుక్రవారం ఈగల్ టీం ఐజి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ దుర్వినియోగంపై దాడులు నిర్వహించారు. పట్టణంలోని పల్నాడు రోడ్డులోని మెడికల్ షాపులు, బరంపేటలో గల భవ్య శ్రీ మెడికల్ ఏజెన్సీలలో తనిఖీలు చేపట్టారు. భవ్య శ్రీ మెడికల్ గోడౌన్ లో అనుమతులు లేకుండా భారీ స్థాయిలో ఔషధాలు నిల్వ ఉంచినట్లు విజిలెన్స్ బృందం గుర్తించి పెద్ద మొత్తంలో మందులు సీజ్ చేసినట్లు ప్రాథమికంగా తెలిపారు. నరసరావుపేట రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు మంగమ్మ, పద్మ, విజిలెన్స్ ఏఈ శివన్నారాయణ, ఎఫ్ఆర్ఓ సైదులు, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.