ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
పేట మెడికల్ షాపుల పై ఆపరేషన్ గరుడ...
Updated on: 2025-03-22 08:24:00

అనుమతులు లేని ఔషధాల నిల్వలను భారీగా గుర్తించిన అధికారులు...
దాడుల్లో పాల్గొన్న ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ అధికారులు...
నరసరావుపేట: జిల్లా కేంద్రం నరసరావుపేటలో మెడికల్ షాపులు, ఏజెన్సీలపై శుక్రవారం ఈగల్ టీం ఐజి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ దుర్వినియోగంపై దాడులు నిర్వహించారు. పట్టణంలోని పల్నాడు రోడ్డులోని మెడికల్ షాపులు, బరంపేటలో గల భవ్య శ్రీ మెడికల్ ఏజెన్సీలలో తనిఖీలు చేపట్టారు. భవ్య శ్రీ మెడికల్ గోడౌన్ లో అనుమతులు లేకుండా భారీ స్థాయిలో ఔషధాలు నిల్వ ఉంచినట్లు విజిలెన్స్ బృందం గుర్తించి పెద్ద మొత్తంలో మందులు సీజ్ చేసినట్లు ప్రాథమికంగా తెలిపారు. నరసరావుపేట రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు మంగమ్మ, పద్మ, విజిలెన్స్ ఏఈ శివన్నారాయణ, ఎఫ్ఆర్ఓ సైదులు, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.