ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పేట మెడికల్ షాపుల పై ఆపరేషన్ గరుడ...
Updated on: 2025-03-22 08:24:00

అనుమతులు లేని ఔషధాల నిల్వలను భారీగా గుర్తించిన అధికారులు...
దాడుల్లో పాల్గొన్న ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ అధికారులు...
నరసరావుపేట: జిల్లా కేంద్రం నరసరావుపేటలో మెడికల్ షాపులు, ఏజెన్సీలపై శుక్రవారం ఈగల్ టీం ఐజి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ దుర్వినియోగంపై దాడులు నిర్వహించారు. పట్టణంలోని పల్నాడు రోడ్డులోని మెడికల్ షాపులు, బరంపేటలో గల భవ్య శ్రీ మెడికల్ ఏజెన్సీలలో తనిఖీలు చేపట్టారు. భవ్య శ్రీ మెడికల్ గోడౌన్ లో అనుమతులు లేకుండా భారీ స్థాయిలో ఔషధాలు నిల్వ ఉంచినట్లు విజిలెన్స్ బృందం గుర్తించి పెద్ద మొత్తంలో మందులు సీజ్ చేసినట్లు ప్రాథమికంగా తెలిపారు. నరసరావుపేట రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు మంగమ్మ, పద్మ, విజిలెన్స్ ఏఈ శివన్నారాయణ, ఎఫ్ఆర్ఓ సైదులు, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.