ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
రంజాన్ మాసం పురస్కరించుకొని ఎమ్మెల్యే గళ్ళ మాధవి చేతుల మీదుగా పేదలకు దుస్తుల పంపిణీ
Updated on: 2025-03-17 12:11:00

రంజాన్ మాసం పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి చేతుల మీదుగా పేదలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం విద్యానగర్ లో ఆదివారం జరిగింది. టీడీపీ నేత అల్తాఫ్, సాహీర బానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళ మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యి పేదలకు దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళ మాధవి మాట్లాడుతూ... ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన నెల రమజాన్ నెల అని, క్రమశిక్షణ, దాతృత్వం, ఆధ్యాత్మిక చింతన. ఈ మూడింటి కలయికే రంజాన్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ నెలల్లో అత్యంత నిష్టతో కఠినమైన ఉపవాసాలు ఆచరిస్తారని, ఈ నెలలో పేదలకు సదఖా పేరుతో సహాయము చేస్తారని, ఇందులో భాగంగా అల్తాఫ్ ముందు వచ్చి ఎంతమందికి దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టటం అభినందనీయమన్ని ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. కార్యక్రమంలో కొమ్మినేని కోటేశ్వరరావు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ మరియు గంటా పెద్దబ్బాయి, మౌళిక, దిలావర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.