ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలిచారు:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
Updated on: 2025-03-04 12:35:00

గుడివాడ మార్చి04:కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుభాకాంక్షలు తెలియజేశారు. గుడివాడ టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ...కూటమి ప్రగతికి మద్దతుగా నిలిచిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఆలపాటి రాజా అఖండ విజయం సాధించేలా కష్టపడిన టిడిపి - జనసేన - బిజెపి పార్టీల శ్రేణులను ఎమ్మెల్యే రాము అభినందించారు. ప్రతి రౌండ్లో తిరుగులేని మెజార్టీతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించడం గొప్ప విషయం అన్నారు.ఈ ఎన్నికలో పట్టబద్రులు మరియు ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ... కూటమి అభ్యర్థికి ఏకపక్షంగా తమ ఓటు వేయడం సంతోషకరమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రజలు,పట్టభద్రుల ఆకాంక్షలకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి,ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు