ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలిచారు:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
Updated on: 2025-03-04 12:35:00

గుడివాడ మార్చి04:కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుభాకాంక్షలు తెలియజేశారు. గుడివాడ టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ...కూటమి ప్రగతికి మద్దతుగా నిలిచిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఆలపాటి రాజా అఖండ విజయం సాధించేలా కష్టపడిన టిడిపి - జనసేన - బిజెపి పార్టీల శ్రేణులను ఎమ్మెల్యే రాము అభినందించారు. ప్రతి రౌండ్లో తిరుగులేని మెజార్టీతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించడం గొప్ప విషయం అన్నారు.ఈ ఎన్నికలో పట్టబద్రులు మరియు ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ... కూటమి అభ్యర్థికి ఏకపక్షంగా తమ ఓటు వేయడం సంతోషకరమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రజలు,పట్టభద్రుల ఆకాంక్షలకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి,ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు