ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మంత్రి సమావేశం
Updated on: 2023-06-26 17:36:00
కుమ్రం భీం - ఆసిఫాబాద్: ఈ నెల 30న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అసిఫాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని, సీఎం పాల్గొనే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో ఈ నెల 30న సీయం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. సభ స్థలం, ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.... బీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో పని చేసి సీయం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలన్నారు. భారీ బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా చూడాలని నాయకులకు సూచించారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీయం కేసీఆర్ ప్రారంభించనున్నారు. లాంఛనంగా పోడు పట్టాలను సీయం పంపిణీ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.