ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
జిల్లాలీ పఠనోత్సనం
Updated on: 2023-06-26 17:36:00

నిర్మల్ జిల్లాలో పఠనోత్సవం కార్యక్రమం ప్రారంభం. నిర్మల్ జిల్లాలోని ఆయ పాఠశాలలో పఠణోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భముగా పొరెడ్డి అశోక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పఠనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సంవత్సరం పిల్లల్లో ధారాళంగా చదివే విధంగా, చదివిన దానిని అర్థం చేసుకుని రాసే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు తయారు చేసిన బోధ్నాభ్యాసన సామాగ్రి రూం టు రీడ్ వారు ఇచ్చిన పుస్తకాలను పిల్లలచే చదివించారు. ఉపాధ్యాయులు పిల్లల్ని మూడు గ్రూపులుగా గ్రూపులుగా విభజించి, సామూహిక అభ్యసనం జట్టు అభ్యసనం అదేవిధంగా వ్యక్తిగత అభ్యసనం జరిగే విధంగా చూడాలని ఉపాధ్యాయులను కోరారు. పిల్లలందరూ గ్రంథాలయ పుస్తకాలను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలో ప్రతిరోజు ఒక ప్రత్యేక పీరియడ్ ఉండాలని కోరారు. ఉపాధ్యాయులు వారు బోధిస్తున్న సమయంలో పది నిమిషాలు చదవడానికి పిల్లలతో చదివించడానికి సమయం కేటాయించాలని కోరారు. జట్లుగా చేసి పిల్లల సామర్థ్యాలకు అనుగుణంగా పుస్తకాలను ఇచ్చి చదువుకునేలా చేయాలన్నారు. పిల్లలు ఇంటి వద్ద కూడా గ్రంథాలయ పుస్తకాలను వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మహేందర్ , రమేష్ బాబు , సురేందర్ , నవిత , రూంటురీడ్ జిల్లా ఇంఛార్జి రవి , కోఆర్డినేటర్ గోవర్ధన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.