ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
జిల్లాలీ పఠనోత్సనం
Updated on: 2023-06-26 17:36:00
నిర్మల్ జిల్లాలో పఠనోత్సవం కార్యక్రమం ప్రారంభం. నిర్మల్ జిల్లాలోని ఆయ పాఠశాలలో పఠణోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భముగా పొరెడ్డి అశోక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పఠనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సంవత్సరం పిల్లల్లో ధారాళంగా చదివే విధంగా, చదివిన దానిని అర్థం చేసుకుని రాసే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు తయారు చేసిన బోధ్నాభ్యాసన సామాగ్రి రూం టు రీడ్ వారు ఇచ్చిన పుస్తకాలను పిల్లలచే చదివించారు. ఉపాధ్యాయులు పిల్లల్ని మూడు గ్రూపులుగా గ్రూపులుగా విభజించి, సామూహిక అభ్యసనం జట్టు అభ్యసనం అదేవిధంగా వ్యక్తిగత అభ్యసనం జరిగే విధంగా చూడాలని ఉపాధ్యాయులను కోరారు. పిల్లలందరూ గ్రంథాలయ పుస్తకాలను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలో ప్రతిరోజు ఒక ప్రత్యేక పీరియడ్ ఉండాలని కోరారు. ఉపాధ్యాయులు వారు బోధిస్తున్న సమయంలో పది నిమిషాలు చదవడానికి పిల్లలతో చదివించడానికి సమయం కేటాయించాలని కోరారు. జట్లుగా చేసి పిల్లల సామర్థ్యాలకు అనుగుణంగా పుస్తకాలను ఇచ్చి చదువుకునేలా చేయాలన్నారు. పిల్లలు ఇంటి వద్ద కూడా గ్రంథాలయ పుస్తకాలను వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మహేందర్ , రమేష్ బాబు , సురేందర్ , నవిత , రూంటురీడ్ జిల్లా ఇంఛార్జి రవి , కోఆర్డినేటర్ గోవర్ధన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.