ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
జిల్లాలీ పఠనోత్సనం
Updated on: 2023-06-26 17:36:00

నిర్మల్ జిల్లాలో పఠనోత్సవం కార్యక్రమం ప్రారంభం. నిర్మల్ జిల్లాలోని ఆయ పాఠశాలలో పఠణోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భముగా పొరెడ్డి అశోక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పఠనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సంవత్సరం పిల్లల్లో ధారాళంగా చదివే విధంగా, చదివిన దానిని అర్థం చేసుకుని రాసే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు తయారు చేసిన బోధ్నాభ్యాసన సామాగ్రి రూం టు రీడ్ వారు ఇచ్చిన పుస్తకాలను పిల్లలచే చదివించారు. ఉపాధ్యాయులు పిల్లల్ని మూడు గ్రూపులుగా గ్రూపులుగా విభజించి, సామూహిక అభ్యసనం జట్టు అభ్యసనం అదేవిధంగా వ్యక్తిగత అభ్యసనం జరిగే విధంగా చూడాలని ఉపాధ్యాయులను కోరారు. పిల్లలందరూ గ్రంథాలయ పుస్తకాలను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలో ప్రతిరోజు ఒక ప్రత్యేక పీరియడ్ ఉండాలని కోరారు. ఉపాధ్యాయులు వారు బోధిస్తున్న సమయంలో పది నిమిషాలు చదవడానికి పిల్లలతో చదివించడానికి సమయం కేటాయించాలని కోరారు. జట్లుగా చేసి పిల్లల సామర్థ్యాలకు అనుగుణంగా పుస్తకాలను ఇచ్చి చదువుకునేలా చేయాలన్నారు. పిల్లలు ఇంటి వద్ద కూడా గ్రంథాలయ పుస్తకాలను వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మహేందర్ , రమేష్ బాబు , సురేందర్ , నవిత , రూంటురీడ్ జిల్లా ఇంఛార్జి రవి , కోఆర్డినేటర్ గోవర్ధన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.