ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కళ్యాణదుర్గం లో జబర్దస్త్ టీం సభ్యుల సందడి
Updated on: 2025-02-08 20:20:00
శ్రీ పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి కళ్యాణదుర్గం పట్టణంలో జబర్దస్త్ టీం సభ్యులు సందడి చేయబోతున్నారు. హాస్య భరిత నాటికలు, జబర్దస్త్ జోకులతో పట్టణ వాసులను, భక్తులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. శనివారం ఉదయం హైదరాబాదు నుండి కళ్యాణదుర్గం వచ్చిన జబర్దస్త్ టీం సభ్యులు గడ్డం నవీన్, అప్పారావు, పవన్ తదితరులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చారు. అక్కమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి కళ్యాణదుర్గం చరిత్రను తెలుసుకున్నారు. ఈ రాత్రి 8.30 గంటల నుండి పొద్దుపోయేదాకా స్థానిక దిన మార్కెట్ ఆవరణంలో సందడి చేయబోతున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు , ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారనీ, వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినట్లు హాస్యనటులు చెప్పారు.