ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
కళ్యాణదుర్గం లో జబర్దస్త్ టీం సభ్యుల సందడి
Updated on: 2025-02-08 20:20:00

శ్రీ పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి కళ్యాణదుర్గం పట్టణంలో జబర్దస్త్ టీం సభ్యులు సందడి చేయబోతున్నారు. హాస్య భరిత నాటికలు, జబర్దస్త్ జోకులతో పట్టణ వాసులను, భక్తులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. శనివారం ఉదయం హైదరాబాదు నుండి కళ్యాణదుర్గం వచ్చిన జబర్దస్త్ టీం సభ్యులు గడ్డం నవీన్, అప్పారావు, పవన్ తదితరులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చారు. అక్కమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి కళ్యాణదుర్గం చరిత్రను తెలుసుకున్నారు. ఈ రాత్రి 8.30 గంటల నుండి పొద్దుపోయేదాకా స్థానిక దిన మార్కెట్ ఆవరణంలో సందడి చేయబోతున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు , ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారనీ, వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినట్లు హాస్యనటులు చెప్పారు.