ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
అనిశా కి చిక్కిన హాస్టల్ వార్డెన్ ఆమె భర్త
Updated on: 2025-01-31 11:15:00
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఎంప్లాయిస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ తీవ్రసంచలనం కలిగించింది వివరాలు ఇలా వున్నాయి మడుపల్లి తాతయ్య జూనియర్ కాలేజ్ ప్రాంగణంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో స్వీపర్గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఝాన్సీ నుండి హాస్టల్ వార్డెన్ నాగమణి 30 వేల రూపాయలు నగదు లంచం తీసుకుంటూ భర్తతో సహా తను ఉంటున్న ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డారు.హాస్టల్లో స్వీపర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ నుండి లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో అంత ఇచ్చుకోలేను అంటూ అనడంతో కనీసం 30,000 ఇమ్మని కోరగా లంచం ఇవ్వడం ఇష్టం లేని స్వీపర్ ఝాన్సీ ఏలూరు ఏసీబీ ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఎసిబి డిఎస్పి సుబ్బరాజు మాట్లాడుతూ లంచం డిమాండ్ చేయడంతో మమ్మల్ని ఆశ్రయించినట్టు గత రాత్రి నిఘా వేసి హాస్టల్ వార్డెన్ నాగమణి మరియు ఆమె భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు అనంతరం ఏసిబి కోర్టులో హాజరు పడుతున్నట్లు తెలిపారు.ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ సీఐ ఎం.బాలకృష్ణ,కే.శ్రీనివాస్,రాజమండ్రి సీఐ ఎన్వి.భాస్కరరావు పాల్గొన్నారు.