ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
అనిశా కి చిక్కిన హాస్టల్ వార్డెన్ ఆమె భర్త
Updated on: 2025-01-31 11:15:00
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఎంప్లాయిస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ తీవ్రసంచలనం కలిగించింది వివరాలు ఇలా వున్నాయి మడుపల్లి తాతయ్య జూనియర్ కాలేజ్ ప్రాంగణంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో స్వీపర్గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఝాన్సీ నుండి హాస్టల్ వార్డెన్ నాగమణి 30 వేల రూపాయలు నగదు లంచం తీసుకుంటూ భర్తతో సహా తను ఉంటున్న ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డారు.హాస్టల్లో స్వీపర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ నుండి లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో అంత ఇచ్చుకోలేను అంటూ అనడంతో కనీసం 30,000 ఇమ్మని కోరగా లంచం ఇవ్వడం ఇష్టం లేని స్వీపర్ ఝాన్సీ ఏలూరు ఏసీబీ ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఎసిబి డిఎస్పి సుబ్బరాజు మాట్లాడుతూ లంచం డిమాండ్ చేయడంతో మమ్మల్ని ఆశ్రయించినట్టు గత రాత్రి నిఘా వేసి హాస్టల్ వార్డెన్ నాగమణి మరియు ఆమె భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు అనంతరం ఏసిబి కోర్టులో హాజరు పడుతున్నట్లు తెలిపారు.ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ సీఐ ఎం.బాలకృష్ణ,కే.శ్రీనివాస్,రాజమండ్రి సీఐ ఎన్వి.భాస్కరరావు పాల్గొన్నారు.