ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
అనిశా కి చిక్కిన హాస్టల్ వార్డెన్ ఆమె భర్త
Updated on: 2025-01-31 11:15:00

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఎంప్లాయిస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ తీవ్రసంచలనం కలిగించింది వివరాలు ఇలా వున్నాయి మడుపల్లి తాతయ్య జూనియర్ కాలేజ్ ప్రాంగణంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో స్వీపర్గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఝాన్సీ నుండి హాస్టల్ వార్డెన్ నాగమణి 30 వేల రూపాయలు నగదు లంచం తీసుకుంటూ భర్తతో సహా తను ఉంటున్న ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డారు.హాస్టల్లో స్వీపర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ నుండి లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో అంత ఇచ్చుకోలేను అంటూ అనడంతో కనీసం 30,000 ఇమ్మని కోరగా లంచం ఇవ్వడం ఇష్టం లేని స్వీపర్ ఝాన్సీ ఏలూరు ఏసీబీ ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఎసిబి డిఎస్పి సుబ్బరాజు మాట్లాడుతూ లంచం డిమాండ్ చేయడంతో మమ్మల్ని ఆశ్రయించినట్టు గత రాత్రి నిఘా వేసి హాస్టల్ వార్డెన్ నాగమణి మరియు ఆమె భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు అనంతరం ఏసిబి కోర్టులో హాజరు పడుతున్నట్లు తెలిపారు.ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ సీఐ ఎం.బాలకృష్ణ,కే.శ్రీనివాస్,రాజమండ్రి సీఐ ఎన్వి.భాస్కరరావు పాల్గొన్నారు.