ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
ఈవీఎం గోదాముకు పటిష్ట భద్రత జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
Updated on: 2025-01-28 15:36:00
ఎన్టీఆర్ జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం) భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్.జి.లక్ష్మీశ తెలిపారు.నెలవారీ సాధారణ తనిఖీల్లో భాగంగా గొల్లపూడి మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచే గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.సీసీ టీవీ కెమెరాలతో గోదాముకు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం,వీవీ ప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందజేయడం జరుగుతుందని రెవెన్యూ,ఎన్నికలు,పోలీస్ తదితర విభాగాల సమన్వయంతో ఈవీఎం గోదాము వద్ద నిరంతర పర్యవేక్షణతో గట్టి నిఘా పెట్టినట్లు వివరించారు. తనిఖీలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం,కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ చంద్రమౌళి,ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ గోపాల్రెడ్డితో పాటు వై.రామయ్య (టీడీపీ),రాజా(బీజేపీ),ఏసుదాసు (ఐఎన్సీ)తదితరులు పాల్గొన్నారు.