ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
జన సైనికులకు అన్ని విధాలుగా అండగా ఉంటా: సామినేని ఉదయభాను
Updated on: 2025-01-22 06:09:00
విజయవాడ ప్రవేట్ హాస్పటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న గూడూరు కి చెందిన సంతోషాన్ని జనసేన కార్యకర్తని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారు జనసేన పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసానిచ్చారు. ఈ సంధర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సంతోష్ కి అండగా ఉంటామని స్పష్టం చేశారు డాక్టర్లని అడిగి ట్రీట్మెంట్ యొక్క వివరాలను స్వయంగా తెలుసుకున్నారు. జనసేన పార్టీ తరఫున ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కార్యకర్తకి తాను ప్రత్యేకంగా అందుబాటులో ఉంటానని ఉదయభాను స్పష్టం చేశారు ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సెంట్రల్ జోన్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్, పార్టీ అధికార ప్రతినిధి రావి సౌజన్య, విజయవాడ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాదిరెడ్డి అమ్ములు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.