ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా..?
Updated on: 2025-01-02 08:01:00

సంక్రాంతికి రైతుకు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కార్..ఆ దిశగా స్పీడ్ పెంచింది. సాగులో వున్న భూములకే రైతు భరోసా. సంపన్నులకు, ఉద్యోగులకు రైతు భరోసా ఉండదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై, నివేదికలో చేర్చాల్సిన అంశాలపై చర్చించింది. సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని, దాంతో పాటు ఎకరాల విషయంలో కొంత కటాఫ్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 7 నుంచి 10 ఎకరాల లోపు భూములు ఉన్న వారికే రైతు భరోసా చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గూగుల్ డేటా, శాటిలైట్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి డేటా సేకరిస్తోంది. అలాగే టాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై జనవరి 4న క్యాబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయించారు.